1
యూదారాజు ఆమోను కుమారుడు యోషీయా దినాల్లో జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. జెఫన్యా కూషీ కుమారుడు. కూషీ గెదల్యా కుమారుడు. గెదల్యా అమర్యా కుమారుడు. అమర్యా హిజ్కియా కుమారుడు.
ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను నాశనం చేస్తాను. దుర్జనులను, వారి శిథిలాలను నేను ఊడ్చివేస్తాను.
భూమి మీద ఎవరూ లేకుండా మానవ జాతిని నిర్మూలం చేస్తాను.>> ఇదే యెహోవా వాక్కు.
బయలు దేవుడి భక్తుల్లో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులైన వారిని, దాని అర్చకులను నిర్మూలం చేస్తాను.
యెహోవా పేరును బట్టి ఒట్టు పెట్టుకుంటూ, ఆయన్ని పూజిస్తూ మిల్కోము దేవుడి
1
పేరు స్మరించే వారిని నాశనం చేస్తాను.
ఆయన బలి సిద్ధపరిచాడు.
తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించాడు.
యెహోవా ప్రభువు సన్నిధిలో మౌనంగా ఉండండి.
రాజకుమారులను విదేశీయుల్లాగా బట్టలు వేసుకునే వారందరినీ నేను శిక్షిస్తాను.
పట్టణం దిగువ భాగంలో అంగలార్పు వినబడుతుంది.
కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వస్తుంది.
ఇదే యెహోవా వాక్కు.
డబ్బు సమకూర్చుకున్న వారందరూ నిర్మూలమైపోయారు.కాబట్టి మక్తేషు లోయ నివాసులారా, విలపించండి.
పేరుకుపోయిన మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం లాంటివారై <<యెహోవా మేలుగానీ కీడుగానీ చేసేవాడు కాడు>> అని మనస్సులో అనుకొనే వారిని శిక్షిస్తాను.
వారి ఇళ్ళు పాడైపోతాయి.
వారు ఇళ్ళు కట్టుకుంటారు గాని వాటిలో కాపురముండరు.
ద్రాక్షతోటలు నాటుతారు గాని వాటి రసం తాగరు.
యెహోవా దినం సమీపంగా ఉంది. అతి శీఘ్రంగా వస్తూ ఉంది.
వినండి. యెహోవా దినం వచ్చేస్తోంది.
పరాక్రమశాలురు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు.
అంధకారం, మసక కమ్మే రోజు.
మేఘాలు ముసిరి గాఢాంధకారం పొదిగే రోజు.
వారు గుడ్డివారిలాగా నడుస్తారు.
వారి రక్తం దుమ్ములాగా ఒలికిపోతుంది.
వారి మాంసాన్ని పెంటలాగా పారేస్తారు.
రోషాగ్నిచేత భూమంతా దహనం అవుతుంది.
హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వ నాశనం చేయబోతున్నాడు.
1
సిగ్గుమాలిన ప్రజలారా, రండి. గాలికి పొట్టు ఎగిరిపోయినట్టు సమయం గతించిపోతోంది.
యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే,
మిమ్మల్ని శిక్షించడానికి యెహోవా ఉగ్రత దినం రాకమునుపే కూడి రండి.
మీరు వెతికి వినయంతో నీతిని అనుసరిస్తే ఒకవేళ ఆయన ఉగ్రత దినాన మీరు భద్రంగా ఉంటారేమో.
అష్కెలోను పాడై పోతుంది.
మధ్యాహ్నవేళలో అష్డోదువారిని బయటికి తరిమి వేయడం జరుగుతుంది.
ఎక్రోను నగరాన్ని దున్నేస్తారు.
ఫిలిష్తీయుల దేశమైన కనానూ,
నిన్ను గూర్చి యెహోవా చెప్పేదేమిటంటే నీలో ఒక్కడూ కాపురం ఉండకుండా నేను నిన్ను లయం చేస్తాను.
మందలకు దొడ్లు అక్కడ ఉంటాయి.
అక్కడ వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉంటుంది.
వారు అక్కడ తమ మందలు మేపుతారు.
చీకటి పడ్డాక వారు అష్కెలోను ఇళ్ళలో నిద్రపోతారు.
అమ్మోనువారు పలికిన దూషణ మాటలు నాకు వినబడ్డాయి.
వారు నా ప్రజల సరిహద్దుల్లో ప్రవేశించి అహంకారంగా వారిని దూషించారు.
అమ్మోను దేశం గొమొర్రా పట్టణం వలె అవుతాయి
1
.
అవి ముళ్ళ చెట్లకు ఉప్పు గోతులకు స్థావరమై ఎప్పుడూ పాడుబడిపోయి ఉంటాయి.
నా ప్రజల్లో శేషించినవారు ఆ దేశాలను దోచుకుంటారు.
నా ప్రజల్లో శేషించినవారు వాటిని స్వతంత్రించుకుంటారు.
కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సేనలప్రభువు యెహోవా వాక్కు ఇదే.
యెహోవా వారికి భయంకరుడుగా ఉంటాడు.
నీనెవె పట్టణాన్ని పాడు చేసి దాన్ని ఆరిపోయిన ఎడారిలాగా చేస్తాడు.
అన్ని జాతుల పశువులు మందలుగా కూడుతాయి.
పక్షులు, గుడ్లగూబలు వారి ద్వారాల పైకమ్ముల మీద వాలుతాయి.
పక్షుల శబ్దాలు కిటికీల్లో వినబడతాయి.
గడపల మీద నాశనం కనిపిస్తుంది.
వారు చేసికున్న దేవదారు కర్రపని అంతటిని యెహోవా నాశనం చేస్తాడు.
అయ్యో, అది పాడైపోయింది. అడవి జంతువులు పడుకునే ఉనికిపట్టు అయింది.>>
అని దారిన పోయేవారంతా చెప్పుకుంటూ,
ఈసడింపుగా దాని వైపు చెయ్యి ఆడిస్తారు.
1
తిరుగుబాటు పట్టణానికి
1
బాధ. హింసాత్మక నగరం భ్రష్టమైపోయింది.
యెహోవా పట్ల విశ్వాసముంచదు. దాని దేవుని దగ్గరికి రాదు.
దాని న్యాయాధిపతులు రాత్రివేళ తిరుగులాడుతూ తెల్లవారేదాకా ఎరలో ఏమీ మిగలకుండా పీక్కు తినే తోడేళ్లు.
దాని యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరిచేవారు.
ఆయన అక్రమం చేసేవాడు కాడు.
అనుదినం తప్పకుండా ఆయన న్యాయ విధులు వెల్లడి చేస్తాడు.
ఆయనకు రహస్యమైనదేమీ లేదు.
అయినా నీతిహీనులకు సిగ్గులేదు.
ఒకడైనా సంచరించకుండా వారి వీధులు నిర్మానుష్యమై పోతాయి.
జనసంచారం లేకుండా వాటిలో ఎవరూ కాపురముండకుండా వారి పట్టణాలను లయపరచిన వాణ్ణి నేనే.
నాపట్ల భయభక్తులు కలిగి శిక్షకు లోబడతారని నేను అనుకున్నాను గాని,
వారు చెడ్డ పనులు చేయడంలో అత్యాశ గలవారయ్యారు.
<<నా కోసం ఎదురు చూడండి.
నేను లేచి ఎర పట్టుకునే దినం కోసం కనిపెట్టి ఉండండి.
నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటినీ వారిపై కుమ్మరించడానికి,
అన్యజనులను పోగు చేయడానికి,
గుంపులు గుంపులుగా రాజ్యాలను సమకూర్చడానికి,
నేను నిశ్చయించుకున్నాను.
నా రోషాగ్ని చేత భూమంతా కాలిపోతుంది.
కాబట్టి నా పరిశుద్ధమైన కొండ దగ్గర నీవిక అహంకారం చూపించవు.
నా మీద తిరగబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు.
అబద్ధమాడరు. కపటాలు పలికే నాలుక వారి నోట ఉండదు.
వారు ఎవరి భయం లేకుండ విశ్రాంతిగా అన్నపానాలు పుచ్చుకుంటారు.>>
ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయండి.
యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి.
మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టాడు.
ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు.
ఇక మీదట మీకు అపాయం సంభవించదు.
యెరూషలేమూ, భయపడకు.
సీయోనూ, ధైర్యం తెచ్చుకో.
ఆయన శక్తిశాలి.
ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు.
ఆయన బహు ఆనందంతో నీ విషయం సంతోషిస్తాడు.
నీ పట్ల తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ విషయమైన సంతోషము మూలంగా ఆయన హర్షిస్తాడు.
వారు గొప్ప అవమానం పొందిన వారు.
కుంటుతూ నడిచే వారిని నేను రక్షిస్తాను.
చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను.
ఏ యే దేశాల్లో వారు అవమానం పాలయ్యారో అలాటి ప్రతి చోటా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేస్తాను.
మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపిస్తాను.
నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును కట్టబెడతాను.
ఇదే యెహోవా వాక్కు.