1
రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి దినాన ప్రవక్త అయిన హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారి, షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుకు, ప్రధానయాజకుడు, యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు.
మీరు భోజనం చేస్తున్నప్పటికీ ఆకలి తీరడం లేదు.
మీరు ద్రాక్షరసం తాగుతున్నప్పటికీ మత్తు రావడం లేదు.
బట్టలు కప్పుకుంటున్నా చలి ఆగడం లేదు.
పనివారు కష్టపడి జీతం సంపాదించుకున్నా జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది.
ఎందుకని? యెహోవా అడుగుతున్నాడు.
ఎందుకంటే నా మందిరం పాడై ఉన్నా మీరంతా మీ చక్కని సొంత ఇళ్ళు కట్టుకుంటూ ఆనందిస్తున్నారు.
భూమి పండడం లేదు.
ధాన్యం విషయంలో, ద్రాక్షారసం విషయంలో, తైలం విషయంలో,
భూమి ఫలించే అన్నిటి విషయంలో,
మనుషుల విషయంలో, పశువుల విషయంలో, చేతి పనులన్నిటి విషయంలో కరువు రప్పించాను.>>
<<నేను మీకు తోడుగా ఉన్నాను.>> ఇదే యెహోవా వాక్కు.
ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడు యెహోషువ మనస్సును,
శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపించాడు.
1
రాజైన దర్యావేషు పరిపాలనలో ఏడవ నెల ఇరవై ఒకటవ దినాన యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమై చెప్పినది ఏమిటంటే,
అలాటి వారికి ఇది ఎలా కనబడుతున్నది?
దానితో ఇది ఏ విధంగానూ సరి పోలినది కాదని తోస్తున్నది గదా.
జెరుబ్బాబెలూ, ధైర్యం తెచ్చుకో.
ప్రధానయాజకుడు, యెహోజాదాకు కొడుకు యెహోషువా, ధైర్యం తెచ్చుకో.
దేశంలో ఉన్న ప్రజలారా, ధైర్యం తెచ్చుకుని పని జరిగించండి.
నేను మీకు తోడుగా ఉన్నాను.
ఇదే సేనల ప్రభువైన యెహోవా వాక్కు.
నా ఆత్మ మీతో ఉంది కాబట్టి భయపడవద్దు.
ఇంకొకమారు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను నేను కంపింపజేస్తాను.
నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను.>>
ఇదే సేనల ప్రభువైన యెహోవా వాక్కు.
ఈ స్థలంలో నేను శాంతిసమాధానాలు నిలుపుతాను.
ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.
తన చెంగుతో రొట్టెనైనా వంటకాన్నైనా, ద్రాక్షారసాన్నైనా,
నూనెనైనా మరి ఏ విధమైన భోజన పదార్థాన్నైనా,
ముట్టుకుంటే ఆ ముట్టుకున్నది ప్రతిష్ఠితమవుతుందా?>> అని యాజకులను అడిగితే, వారు <<కాదు>>. అన్నారు.
అతడు ముట్టుకున్నది అపవిత్రం అవుతుందా?>> అని హగ్గయి మళ్లీ అడిగినప్పుడు యాజకులు <<అది అపవిత్రం అవుతుంది>> అన్నారు.
ఈ ప్రజలు కూడా నా దృష్టికి అలానే ఉన్నారు.
వారు చేసే క్రియలన్నీ వారక్కడ అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రం. ఇదే యెహోవా వాక్కు.
ఏభై కొలల తొట్టి దగ్గరికి ఒకడు రాగా ఇరవై కొలలు మాత్రమే దొరకుతున్నది.
అయినా మీలో ఒక్కడు కూడా తిరిగి నా దగ్గరికి రాలేదు. ఇదే యెహోవా వాక్కు.
ఇంతకు ముందు తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినం నుండి,
అంటే యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి.
అయితే ఇది మొదలు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
ఆకాశాన్ని, భూమిని నేను కంపింపజేయ బోతున్నాను.
అన్యజనుల రాజ్యాలకున్న బలాన్ని నాశనం చేస్తాను.
రథాలను, వాటిని ఎక్కిన వారిని కింద పడేస్తాను.
గుర్రాలు రౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలి పోతారు.
నేను నిన్ను ఏర్పరచుకున్నాను.
కాబట్టి ఆ రోజున నేను నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.>>